మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. చంద్రబాబు హయాంలో అవినీతికి పాల్పడ్డారంటూ ‘మీ ఫినాయిల్ పేపర్’లో రాసుకుని సంబరాలు చేసుకుంటామంటే మీ ఇష్టం’ అని పేర్కొన్నారు. బాబు హయాంలో 10 పైసలు అవినీతి జరిగిందని నిరూపించలేని మీరు..ఫినాయిల్ పేపర్లో అవినీతి అంటూ ఏడుపులు ఎందుకు? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
అవినీతిని తవ్విస్తామంటూ సీఎం జగన్ తవ్వడం ప్రారంభించి దాదాపు ఏడు నెలలు కావొస్తోందంటూ ఓ సామెతను జోడించి విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. వెనుకటి మీలాంటి వాడే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నాడట, కనీసం, ఎలుక కాదు కదా దాని తోకను కూడా మీరు పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.