telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీకి తోట దంపతుల గుడ్‌బై

MP Thota narasimham Family shortly join YCP

కాకినాడ ఎంపీ తోట నరసింహాం ఫ్యామిలీ సోమవారం టీడీపీకి గుడ్‌ బై చెప్పింది. నరసింహాం ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే తనకు బదులుగా తన భార్య వాణికి జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్టును ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరారు. జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకే బాబు టిక్కెట్టును ఖరారు చేశారు. ఈ తరుణంలో తోట నరసింహం భార్య వాణి ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.

టిక్కెట్టుపై చంద్రబాబునాయుడు నుండి స్పష్టత రాకపోవడంతో తోట కుటుంబం టీడీపీకి గుడ్‌బై చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. రెండు రోజుల్లో తోట దంపతులు వైసీపీలో చేరనున్నారు. కాకినాడ లేదా పెద్దాపురం అసెంబ్లీ స్థానాల నుండి తోట వాణి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. 2014 ఎన్నికలకు ముందే తోట నరసింహం టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్ధిగా కాకినాడ నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

Related posts