తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఎంపీ సుజనా చౌదరి తొలిసారి విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ చానల్ ప్రతినిధితో మాట్లాడారు. గుంటూరులో జరిగే పార్టీ పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు తానువిజయవాడ వచ్చాను తప్ప ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పలువురు సీనియర్ నాయకులు త్వరలోనే తమ పార్టీలో పలువురు సీనియర్లు చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకా విషయం తెలియదని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. ఇక పార్టీలో ఎవరెవరో చేరుతున్నారన్న విషయం మీడియాలో వచ్చిన వార్త వల్లే తనకూ తెలుసునని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని పేర్కొన్నారు.