telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కొవిడ్ వ్యాక్సిన్ వచ్చేవరకు…ప్లాస్మా దాతలే వ్యాక్సిన్

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కొత్త కార్యక్రమాలను తీసుకువచ్చి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ముందుకు సాగుతోంది. ఈ ఛాలెంజ్ ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరు స్వీకరిస్తున్నారు. తాజాగా… ప్లాస్మా డొనేషన్ చేసిన వారికి సన్మానం చేశారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.

సైబరాబాద్ పోలీస్ లు చేసిన ప్లాస్మా డొనేషన్ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. ఏడాది క్రితం నా భార్య కు డెంగ్యూ వచ్చిందని..ప్లేట్ లెట్ కౌంట్స్ 10 వేలకు పడిపోయింది..అప్పుడు నేను ప్లాస్మా డోనర్స్ కోసం తీవ్రంగా వేతకల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ వచ్చేవరకు…ప్లాస్మా దాతలే వ్యాక్సిన్ అని పేర్కొన్నారు. కరోనా వచ్చిన వారికి , ప్లాస్మా ఇచ్చే వారికి మధ్య వర్తులుగా ఉన్న వాలంటీర్స్ కు అభినందనలు తెలిపారు. కరతాల ధ్వణులతో వాలంటీర్స్ ను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.

Related posts