చెన్నైలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏఐఏడీఎంకే ఎంపీ ఎస్.రాజేంద్రన్ (62) దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం విల్లుపురం జిల్లా దిండివనమ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువస్తున్న ఆయన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ రాజేంద్రన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాజేంద్రన్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
రాజేంద్రన్ 2014 లోక్సభ ఎన్నికల్లో విల్లుపురం నుంచి పోటీ చేసిన ఆయన డీఎంకే అభ్యర్థి ముత్తయన్ పై 2లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంపీ రాజేంద్రన్ మృతి పట్ల ఏఐఏడీఎంకే పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఏటా రూ.8 వేల కోట్లు దుబారా.. వైసీపీ సర్కార్ పై యనమల ధ్వజం