telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇంకో పదిసార్లు ఎన్నికలు పెట్టినా ఏకగ్రీవాలు జరుగుతాయి…

ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఏకగ్రీవాల రగడ నడుస్తుంది. అయితే చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలకు గాను 110 ఏకగ్రీవాలు నమోదు కావడంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించకూడదని కమీషన్ స్పష్టం చేయడంతో అధికార పార్టీ నేతలకు షాక్ తగిలినట్టు అయింది. అయితే ఎన్నికల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏకగ్రీవాలు జరిగాయని వాటిని తప్పుపడటం ఎంటని కౌంటర్ ఇస్తున్నారు వైకాపా నేతలు. తాజాగా ఈ అంశం మీద స్పందించారు ఎంపీ మిథున్‌రెడ్డి. నామినేషన్లు వేస్తే చాలా గెలిచినట్లుగా టిడిపి భావిస్తోందని ఎంపీ మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ తిరుపతికి వచ్చి… ఏకగ్రీవాలు అయితే చర్యలు తీసుకుంటానని బెదిరించినా ప్రజలు మాత్రం పంచాయతీలను ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు వైకాపా వైపు ఉంటే ఎన్నికల కమిషన్‌ మాత్రం ఏం చేస్తుంది..చంద్రబాబు ఏం చేస్తాడని తెలిపారు. ఇంకా ఏకగ్రీవాలు జరుగుతాయి.. 2,3,4 దశలలో కూడా ఏకగ్రీవాలు జరుగుతునే ఉంటాయని స్పష్టం చేశారు ఎంపీ మిథున్‌రెడ్డి. ఇంకో పదిసార్లు ఎన్నికలు పెట్టినా ఏకగ్రీవాలు జరుగుతాయన్నారు. పోటీ అభ్యర్థుల దొరకని పార్టీలు మా గురించి మాట్లాడటామా ? అని ప్రశ్నించారు. ఇంకా ఏకగ్రీవాలు జరుతాయో తప్ప… ఆగేది ఉండదని గుర్తు పెట్టకోండి అని స్పష్టం చేశారు ఎంపీ మిథున్‌రెడ్డి. 

Related posts