telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొత్త లైన్లు అడిగినా ఇవ్వలేదంటూ.. రైల్వే సమావేశంలో ఎంపీ కేశినేని ఫైర్

kesineni-nani

విజయవాడలో రైల్వే జీఎంతో ఎంపీల సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రైళ్లు, కొత్త లైన్లు అడిగినా ఇవ్వలేదంటూ సమావేశంలో మండిపడ్డారు. గతంలో ఎన్నో ప్రాజెక్టులు అడిగామని ఒక్కటి కూడా ఇవ్వలేదంటూ విరుచుకుపడ్డారు.

మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించడం కాదని రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం రైల్వేజోన్ పరిధి తగ్గించారంటూ సమావేశంలో వెల్లడించారు. అనంతరం సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. సమావేశంలో ఉండాలని అధికారులు కోరినప్పటికీ ఎంపీ కేశినేని నాని మాత్రం బయటకు వచ్చారు.

Related posts