ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సేవలు దేశానికి అవసరమని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజును కనకమేడల నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గొప్ప నాయకుడని ఆయన సేవలు ఏపీకే కాకుండా, యావత్ దేశానికి అవసరమని తెలిపారు.
రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించబోతున్నారని అన్నారు. సీఎం పనితీరును గుర్తించిన రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో టీడీపీకి మరోసారి పట్టం కట్టబోతున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో కూడా బీజేపీయేతర కూటమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారు: పవన్