telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి క్లీన్‌ చిట్‌

TDP MP JC Diwakar reddy sensational comments

తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి ఊరట లభించింది. ఇటీవల ఎన్నికల్లో అనంతపురంలో పార్టీలన్నీ రూ.50 కోట్లు ఖర్చుచేశాయని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జేసీ దివాకర్‌ రెడ్డికి తాడిపత్రి ఆర్వో ప్రభాకర్‌ రెడ్డి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని జేసీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల వ్యయంపై జేసీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జేసీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆర్వోని ఆదేశించారు.

విచారణ జరిపిన ఆర్వో జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోయిందని, అన్ని పార్టీలు రూ. 10వేల కోట్లు ఖర్చు చేశాయని, పోటీలు పడి పార్టీలు ఖర్చు పెట్టాయని, మొదట్లో పోటీకి రూ. లక్ష, రెండోసారి రూ. 25 లక్షలు, ఇప్పుడు రూ. 25 కోట్లు లేకుంటే పోటీ చేసే పరిస్థితి లేదని జేసీ వ్యాఖ్యానించారు. అయితే జేసీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఎవరి పేరును నేరుగా ప్రస్తావించలేదని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పరిధిలోకి రాదని ఆర్వో నివేదిక సమర్పించారు.

Related posts