కేంద్ర బడ్జెట్లో ఏపీ విభజన హామీల గురించి ఊసే లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. గురువారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ రోజుకు రూ. 17 ఇవ్వడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులను అవమానించారని విమర్శించారు.
ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఉన్నవి ఊడగొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు తిరుపతి, నెల్లూరు సభల్లో ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని గల్లా జయదేవ్ అన్నారు. ఢిల్లీని మించిన రాజధాని కడతామని చెప్పి, పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు.