telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ

తెలుగు రాష్ట్రాలో ఒకేసారి లోక్‌సభ ఎన్నికలు!

తెలుగు రాష్ట్రాలో  ఒకే దఫా లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేపట్టామని.. త్వరలో ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ, ఏపి రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించటం ద్వారా భద్రతాపరమైన ఇబ్బందులు ఉండవన్నారు. 
రెండు చోట్లా ఒకే దఫా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల కోసం 22,454 అదనంగాఈవిఎంలు, 14,670 వీవీప్యాట్లు అదనంగా కావాలని కూడా ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాలను పెంచే ఆలోచన లేదన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇతర రాష్ట్రాల నుంచి 18 వేల మంది పోలీసులు తెలంగాణకు రానున్నారని పేర్కొన్నారు.

Related posts