హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని లోక్ సభ స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నేడు లోక్ సభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, బీఫారాలు అందుకున్న వీరంతా నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ 18న ప్రారంభం కాగా, ఇప్పటి వరకు సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి 14 నామినేషన్లు, హైదరాబాద్ నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. లోక్ సభ నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. దీంతో మిగతా అభ్యర్థులంతా సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
సికింద్రాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని సాయికిరణ్యాదవ్ నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి పుస్తె శ్రీకాంత్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి జి.కిషన్రెడ్డి, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి డా.భగవంతరావు, సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్కుమార్, హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ఖాన్ లు తమ మద్దతుదారులతో ఆయా కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
అందుకే చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయారు: విజయసాయిరెడ్డి