telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ముస్లింలు, ద‌ళితుల‌పైనే క్రూర‌మైన చట్టాలు..లోక్‌స‌భ‌లో అస‌ద్దుదీన్ ఫైర్

MIM Comments MP Elections

ముస్లింలు, ద‌ళితుల‌పైనే క్రూర‌మైన చ‌ట్టాల‌ను ఉప‌యోగిస్తున్నార‌ని లోక్‌స‌భ‌లో హైదరాబాద్ ఎంపీ అస‌ద్దుదీన్ ఓవైసీ మండిపడ్డారు. చ‌ట్ట‌విరుద్ద కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డేవారిపై క‌ఠిన శిక్ష‌ను అమ‌లు చేయాలంటూ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుపై ఓవైసీ మాట్లాడారు. యూఏపీఏ బిల్లు.. ఆర్టిక‌ల్ 21ని ఉల్లంఘిస్తుంద‌న్నారు. న్యాయ‌ప‌ర‌మైన హ‌క్కుల్ని ఆ బిల్లు నాశ‌నం చేస్తోంద‌న్నారు.

అంత‌ర్జాతీయ ఒప్పందాల కోసం జాతీయ‌వాదాన్ని అమ్మేస్తున్నారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలో ఇలాంటి క‌ఠిన‌మైన చ‌ట్టాల‌ను చేసిన కాంగ్రెస్ పార్టీని కూడా ఓవైసీ త‌ప్పుప‌ట్టారు. ఈ చ‌ట్టాల ద్వారా ఒక్క కాంగ్రెస్ నేత‌నైనా అరెస్టు చేయండి, అప్పుడే వాళ్ల‌కు ఆ చ‌ట్టం తెలుస్తుంద‌ని ఓవైసీ కాంగ్రెస్ పార్టీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Related posts