మోటరోలా బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మోటో జి8 ప్లస్ భారత మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ 29 నుంచి సేల్ ప్రారంభం కానుంది. మిడ్ సిగ్మంట్ కింద కంపెనీ ఆఫర్ చేస్తున్న ఈ మోటో జీ8 ప్లస్ ఫోన్ ధర రూ.13వేల 999నుంచి లభ్యం కానుంది. ఇందులో ఫీచర్ల విషయానికి వస్తే.. 6.3 అంగుళాల IPS LCD మ్యాక్స్ విజన్ డిస్ ప్లే ఉంది. (అస్పెక్ట్ రేషియో 19;9). ఫుల్ హెచ్ డీ రెజుల్యుషన్ 1080×2340 ఫిక్సల్స్ తో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. LED ఫ్లాష్ కెమెరాలకు మరింత ఎఫెక్టీవ్ గా కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ కు ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కూడా ఉంది. 4,000mAh బ్యాటరీ సామర్థ్యంతో 15W టర్బో పవర్ 2 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోటో జీ8 ప్లస్ ఫోన్.. కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ పింక్ మొత్తం రెండు కలర్లలో లభ్యం అవుతోంది.
Moto G8 Plus ఫీచర్లు :
* 6.3 అంగుళాల IPS LCD మ్యాక్స్ విజన్ డిస్ ప్లే
* ఫుల్ హెచ్ డీ రెజుల్యుషన్ 1080×2340 ఫిక్సల్స్
* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 665 SoCతో
* 4GB ర్యామ్ సపోర్ట్, 64GB ఇంటర్నల్ స్టోరేజీ
* అడ్రినో 610 GPU (గ్రాఫిక్స్)
* మైక్రో SD కార్డు స్లాట్
* 4,000mAh బ్యాటరీ, 15W టర్బో పవర్ 2 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్
* ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 48MP ప్రైమరీ సెన్సార్
* సెకండరీ యూనిట్ 16MP వైడ్ యాంగిల్ కెమెరా
* 5MP లెన్స్ డెప్త్ సెన్సార్
* ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ (బ్యాక్)
* Wi-Fi, Bluetooth v5.0, GPS, NFC, FM Radio
* 3.5mm ఆడియో సాకెట్, USB Type-C port
* ఆండ్రాయిడ్ పై వెర్షన్ 9.0