telugu navyamedia
సినిమా వార్తలు

తెరపైకి “మదర్ థెరిసా” బయోపిక్… నటీనటులు ఖరారు

Mother-Teresa

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. అందులో భాగంగానే ప్రముఖులు జీవిత చరిత్రలు తెరపై ఆవిష్కృతమవుతున్నాయి. తాజాగా భారత రత్న మదర్ థెరీసా జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందనుంది. ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. నిర్మాతలు ప్రదీప్ శర్మ, గిరీష్ జోహర్, నితిన్ మన్మోహన్, ప్రాచీ మన్మోహన్ సంయుక్తంగా “మదర్ థెరీసా : ది సెయింట్” అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాతలు ఇటీవలే ఈ బయోపిక్ కోసం సిస్టర్ ప్రేమ మేరీ పైరిక్, సిస్టర్ లిన్నేలను కలుసుకుని వారి ఆశీర్వాదం తీసుకున్నారు. “మదర్ థెరీసా : ది సెయింట్” అనే పుస్తకాన్ని సీమా ఉపాధ్యాయ్ రచించారు. ఈ సినిమాకు సీమానే దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ సినిమాలో మదర్ థెరీసా పాత్రకు తగిన నటి ఇంకా ఎంపిక కాలేదు. ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు ఉండనున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులలో సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో మదర్ థెరీసాపై పలు డాక్యుమెంటరీ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.

Related posts