అరిజోనాలో ఓ తల్లి మారాం చేస్తున్నాడని, ఏడుస్తున్నాడని కన్నకొడుకునే అత్యంత దారుణంగా కడతేర్చింది. మూడేళ్ల ఆ పసివాడిని తోటలో కట్టేసి తిండి పెట్టకుండా వదిలేసింది. తినడానికి ఏమీ లేకపోవడంతో ఆకలికి అలమటించిన ఆ పసివాడు… ఏడ్చి ఏడ్చి చివరకు కన్నుమూశాడు. ఈ ఘోరమైన ఘటన 2014లో జరిగింది. అయితే 34 ఏళ్ల రాకీల్ బేరీస్ అరిజోనాలో తాను అద్దెకుంటున్న ఇళ్లు ఖాళీ చేసే వరకూ ఈ విషయం బయటపడలేదు. ఆమె ఇళ్లు ఖాళీ చేయడంతో… ఇల్లు మొత్తం శుభ్రం చేయిస్తున్న ఇంటి యజమానికి తోటలో ఉన్న మూడేళ్ల రోమన్ అస్థిపంజరం కనబడింది. దాన్ని చూసి భయాందోళనలకు గురైన అతను… పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రాకీల్ను అదుపులోకి తీసుకున్నారు.
previous post
next post
ఉత్తరాంధ్రకు ఎవరేం చేశారో చర్చిద్దామా? : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు