తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నర్మెట్ట మండలం మలక్పేట శివారులోని భిక్యా తండాలో ఇద్దరు పిల్లలు భానుశ్రీ(4), వరుణ్(3) గొంతుకోసి చంపిన తల్లి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గుర్తించిన స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పిల్లలు మృతి చెందగా తల్లి రమ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.