telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఇద్దరు పిల్లకు నిప్పటించి.. తల్లి ఆత్మహత్యాయత్నం

Engineering college Fees student sulcide

కుటుంబ కలహాలతో కన్న బిడ్డలకు నిప్పంటించి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ తల్లీ.వి వరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదు పురంలో పద్మావతి అనే మహిళ భర్తతో కలిసి జీవిస్తోంది. భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో చిలిచిలికి గాలివానలా మారి పెద్ద వివాదానికి దారి తీశాయి. దాంతో సహనం కోల్పోయిన పద్మావతి తన ఇద్దరు పిల్లలకు కిరోసిన్ పోసి నిప్పటించింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం గమనించిన స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా దారుణం జరిగింది. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts