telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు లో .. మరిన్ని సీన్ లు ..

Sarileru-nIkevvaru

నటుడు మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సఫీసు వద్ద దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. మహర్షి లాంటి క్లాస్ మూవీ తర్వాత మహేష్ బాబు నటించిన పక్కా మాస్ ఎంటర్ టైనర్ కి జనాలు నీరాజనాలు పలికారు. అయితే ఎక్కడో మహేష్ రేంజ్ కి ఈ సినిమా సరిపోదని అనిపించినా కూడా ఫర్వాలేదులే అనిపించింది. ఈ సినిమా లో వినోదంతో పాటు ఎమోషన్ సీన్లు కూడా బాగానే ఉన్నాయి. ప్రథమార్థంలో వినోదాన్ని నమ్ముకున్న అనిల్ రావిపుడి ద్వితీయార్థంలో ఎమోషన్ మరియు మాస్ సీన్లని నమ్ముకుమ్మాడు. సినిమా బాగానే ఉన్నప్పటికీ లెంగ్త్ విషయంలో ప్రేక్షకులని ఒకింత బోర్ కలిగించిందనే వాదనలు వచ్చాయి. ఒక మాస్ సినిమాను 2 గంటల 50 నిమిషాల నిడివితో సినిమాను థియేటర్లలోకి వదలడం అంటే సాహసమే.

అలాంటిది అంత సేపు ఉండడమే ఎక్కువ అని ఫీల్ అవుతుంటే మరిన్ని సీన్లు కలపాలని అనుకుంటున్నారట. పెద్ద సినిమాలు రిలీజయ్యాక రెండో వారం నుంచి రన్ పెంచడం కోసం ఇలా అదనపు సీన్లు కలపడం కొత్తేమీ కాదు.కానీ సరిలేరు.. సంగతి వేరు. ఆ సినిమా నిడివి ఇప్పటికే ఎక్కువైంది. పైగా దాని థియేట్రికల్ రన్ పూర్తి కావచ్చింది. అయినా సరే.. ఇలా రిలీజైన రెండు వారాలకు సీన్లు కలపడం ఆశ్చర్యమే. ప్రథమార్ధంలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్‌లో కత్తిరించిన కొన్ని సీన్లను ఈ శుక్రవారం నుంచి జత చేయనున్నట్లు సమాచారం. దర్శకుడు అనిల్ రావిపూడి ఓ రేంజిలో చెప్పుకున్న ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. మరి నిజంగా కలుపుతారా లేదా అన్నది తెలియాలి.

Related posts