telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నేడూ ..వైసీపీలోకి భారీగా వలసలు .. !

YCP released MLA Candidates List

ఏపీలో ఎన్నికల నగారా మోగిన తరువాత నేతల జంపింగ్‌లు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ సైతం వైసీపీకి చెందిన పలువురిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. నేడు వైఎస్ జగన్ సమక్షంలో రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన ఆరుగురు కీలకనేతలు వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. కొణతాల రామకృష్ణ, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వంగా గీత, బుట్టా రేణుక, బల్లి దుర్గ ప్రసాద్‌, ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారు.

ప్రస్తుతం వైఎస్ జగన్ కడప జిల్లాలో ఉన్నారు.. ఆయన హైదరాబాద్‌కు రాగానే ఈ ఆరుగురు వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. వీరిలో కొణతాల రామకృష్ణ, ఎంపీ బుట్టా రేణుక వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. కొణతాల ఇప్పటి వరకూ ఏ పార్టీలో చేరకపోగా మళ్లీ సొంతగూటికి వస్తున్నారు. బుట్టా రేణుకకు టీడీపీలో టికెట్ కన్ఫామ్ కాకపోవడం, కోట్ల కుటుంబం టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆమె టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వంగాగీత, బల్లి దుర్గా ప్రసాద్ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం అధిష్టానం.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే తాజాగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

ఇక ఆదాల విషయానికొస్తే.. నెల్లూరు రూరల్ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆయన శుక్రవారం మధ్యాహ్నం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన శనివారం వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ ఆరుగురిలో జగన్ ఎంత మందికి టికెట్లిస్తారో వేచి చూడాల్సిందే మరి.

Related posts