‘ఎల్ కేజీ’ తరువాత నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘మూకుత్తి అమ్మన్’. లేడీ సూపర్స్టార్ నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం కన్నియకుమారిలో లాంఛనంగా పారంభించారు. ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్కోయిల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుగనుంది. ఈ చిత్రానికి ఎన్జే శరవణన్ సహదర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎల్కేజీ’, ‘కోమాలి’, ‘పప్పీ’ విజయాల తరువాత వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్పై ఐసరి కె.గణేష్ నిర్మిస్తున్న చిత్రమిది. ‘అవల్’ ఫేమ్ క్రిష్ గోపాలకృష్ణన్ సంగీతం, ‘తానా సేర్న్ద కూట్టం’ ఫేమ్ దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార అమ్మన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
previous post