telugu navyamedia
ట్రెండింగ్

నైరుతి రుతుపవనాలు .. జూన్ మొదటివారంలోనే..

monsoon on june first week only

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీన కేరళాను తాకనున్నట్లు స్కైమెట్ సంస్థ ప్రకటించింది. 2019 సంవత్సరంలో వర్షాలు సాధారణంగా ఉంటాయని పేర్కొంది. జులై 15వ తేదీ వరకు రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయని పేర్కొన్నారు. దీంతో పంట దిగుబ‌డి కూడా అధికంగా ఉంటుంద‌ని పేర్కొన్న‌ది.

ఆర్థిక ప్ర‌గ‌తి కూడా బాగానే ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. దేశ‌వ్యాప్తంగా సాధార‌ణ వ‌ర్ష పాతం న‌మోద‌య్యే ప్రాంతాలు 70 శాతం క‌న్నా ఎక్కువే ఉన్న‌ట్లు స్కైమెట్ సీఈవో తెలిపారు. కొన్ని ప్ర‌దేశాల్లో మాత్ర‌మే అధిక వ‌ర్షం సూచ‌న ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

Related posts