మరో లైడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ప్రముఖ తమిళ హీరో సూర్య ఇందులో హీరో. ‘శూరరై పోట్రు’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూర్యే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో కథకు కీలకంగా నిలిచే అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రకు మోహన్బాబు మాత్రమే యాప్ట్ అని ఆయన్ను అప్రోచ్ అయింది చిత్రబృందం. ఈ చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి గురువారం మోహన్బాబు చెన్నై వెళ్లారు. శుక్రవారం చెన్నై ఎయిర్పోర్ట్లో జరిగే షూటింగ్లో పాల్గొంటారాయన. ఆరు నెలలకు ముందు ఈ సినిమాకి సైన్ చేశారాయన. బాక్సింగ్ నేపథ్యంలో హిందీలో “సాలా కదూస్”, తమిళంలో “ఇరుది సుట్రు” పేరుతో సుధ కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిన విషయం తెలిసిందే. “ఇరుది సుట్రు”ని తెలుగులో “గురు” పేరుతో సుధ కొంగర తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమతొ తాజాగా సూర్య–మోహన్బాబు కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
previous post
next post