జగన్ ప్రజల సీఎం అవుతారన్న నమ్మకంతోనే నేను తిరిగి రాజకీయాల్లోకి వచ్చానని ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు అన్నారు. వైఎస్ జగన్ ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే నా కోరిక అని పేర్కొన్నారు. అందుకే ఆ దిశగా ఎన్నికల నా వంతు ప్రయత్నం చేశానన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు చైర్మన్ పదవికి ప్రముఖ నటుడు మోహన్ బాబు రేసులో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్న తరుణంలో మోహన్ బాబు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ ను ఏపీ సీఎం గా చూడాలన్ననా నమ్మకంతోనే నేను రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చానని, అంతేతప్ప నామినేటెడ్ పదవ కోసం కాదు అని మోహన్ బాబు ట్విటర్ లో స్పష్టం చేశారు.
మూఢ నమ్మకాలతో సచివాలయ భవనాలను కుల్చోద్దు: రేవంత్