నేడు ఉపాధ్యాయుల దినోత్సవం, ఈ సందర్భంగా ప్రధాని మోదీ టీచర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆయన ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతినే మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్కు మోదీ నివాళి అర్పించారు. రాధాకృష్ణన్ అత్యుత్తమ ఉపాధ్యాయుడన్నారు. ఓ మంచి మార్గదర్శకుడు కూడా అని తన ట్వీట్లో మోదీ తెలిపారు.
టీచర్లకు వయసుతో సంబంధంలేదని, రిటైర్మెంట్ ఉండదని ప్రధాని తన వీడియో సందేశంలో చెప్పారు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. రాధాకృష్ణన్ మాత్రం ఓ శిక్షకుడిగానే ఉన్నారన్నారు. బోధనాతత్వాన్ని మరవనివారే మంచి టీచర్లు అవుతారన్నారు. మెరుగైన విద్యార్థులను తయారు చేస్తారన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా టీచర్లందరికీ గ్రీటింగ్స్ తెలిపారు.
शिक्षक दिवस के अवसर पर सभी शिक्षकों को हार्दिक शुभकामनाएं।
Teachers Day greetings to everyone.
India pays tributes to Dr. S Radhakrishnan, an exceptional teacher and mentor, on his Jayanti. pic.twitter.com/nQWpa9tYLp
— Narendra Modi (@narendramodi) September 5, 2019