ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో తారాతోరణం కొలువైంది. రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులతో పాటు సినీ తారలతో రాష్ట్రపతిభవన్ పరిసరాలు కళకళలాడిపోతున్నాయి. కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే ఎంపీలు కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు.
సాయంత్రం ఏడు గంటలకు ప్రమాణస్వీకారోత్సవం జరగనుండగా, అంతకుముందు మోదీ తన నివాసంలో అందరికీ టీ పార్టీ ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రులుగా తనతో పాటు ప్రమాణం చేయబోతున్న నేతలను మోదీ తన నివాసానికి ఆహ్వానించారు.దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించారు. రజనీ తన అర్ధాంగి లతతో కలిసి హాజరయ్యారు.