పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. సిలిగురిలో బుధవారం జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మమతకు పేదలంటే పట్టింపు లేదన్నారు. పేదరికం పేదరికం నశిస్తే తన రాజకీయ జీవితం ముగిసిపోతుందని భయపడుతున్నారని దుయ్యబట్టారు.
బాలాకోట్ దాడులతో మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంటే మమతా బెనర్జీ ఆవేదనకు గురయ్యారని విమర్శించారు. వైమానిక దాడులకు సాక్ష్యాలు కావాలంటూ అడిగారని తప్పుబట్టారు. దేశంలోని పేదల కోసం కేంద్రం ఆయుష్మాన్ భవ పథకాన్ని తీసుకొస్తే, ఆ పథకాన్ని మమతా బెంగాల్లో అడ్డుకున్నారని, ఈ స్పీడ్ బ్రేకర్ దిగిపోయే రోజు కోసం ఎదురుచూస్తున్నామని మండిపడ్డారు.