telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పాక్ ప్రధానికి.. మోడీ మరోసారి స్పష్టంగా లేఖ..

pak will lose if war declared with india

ఇటీవ‌ల పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌.. రెండుదేశాల మ‌ధ్య‌ శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌ని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖ‌కు మోదీ స్పందించారు. ఉగ్ర‌వాదంపై ఉక్కుపాదం మోపితేనే.. చ‌ర్చ‌లు సాధ్యం అవుతుంద‌ని మోదీ పాక్‌కు రాసిన లేఖ‌లో స్పష్టం చేశారు. చ‌ర్చ‌లు జ‌ర‌గాలంటే ఈ నిబంధ‌న అవ‌స‌రం అన్నారు.

విశ్వ‌స‌నీయ‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించాల‌ని, ఉగ్ర‌వాదం ఉండ‌కూడ‌ద‌ని, హింస లేని ప‌రిస్థితుల్లోనే చ‌ర్చ‌లు సాధ్యం అవుతాయ‌ని మోదీ త‌న లేఖ‌లో ఇమ్రాన్‌కు తెలిపారు. పాక్ నుంచి అందిన కంగ్రాట్స్ మెసేజ్‌కు ప్ర‌తిగా.. భార‌త ప్ర‌భుత్వం త‌న లేఖ‌లో ఈ విష‌యాన్ని చెప్పిన‌ట్లు విదేశాంగ శాఖ వెల్ల‌డించింది.

Related posts