telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ కోసం ప్రత్యేక రాఖీలు.. సిద్దం చేసిన ముస్లిం మహిళలు

modi on jammu and kashmir rule

ప్రధాని నరేంద్ర మోదీ కోసం వారణాసి నియోజకవర్గ ముస్లిం మహిళలు ప్రత్యేక రాఖీలు తయారు చేశారు. ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లిం మహిళలు ఇంతకాలం ఎన్నో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. వారి హక్కులను కాపాడేందుకు, వారికి సరైన జీవితాన్ని అందించేందుకు మోదీ సర్కారు ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసింది.

ఏక కాలంలో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తలను జైలుకు పంపనుంది. మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ముస్లిం మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు. తమ సంరక్షణ కోసం పాటుపడిన మోదీకి వినూత్నంగా ధన్యవాదాలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 15 సందర్భంగా మోదీకి ప్రత్యేక రాఖీలు పంపాలని ముస్లిం మహిళలు నిర్ణయించారు.

Related posts