ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిశారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణస్వీకారోత్సవానికి విజయవాడ రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో జగన్ రాష్ట్రపరిస్థితిని మోదీకి వివరించారు.
జగన్ ప్రస్తావించిన ప్రధాన అంశాలు :
* రాష్ట్రానికి ప్రత్యేక హోదా
* విభజన చట్టంలోని హామీలు అమలు
* ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల
* పోలవరం ప్రాజెక్ట్ కు సహకారం, అదనపు నిధుల మంజూరు
* రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం
* కడప స్టీల్ ప్లాంట్
* దుగరాజపట్నం మేజర్ పోర్టు ఏర్పాటు
* ఏపీ ఆర్థిక పరిస్థితి
* రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు
జగన్ మాట్లాడుతున్నంత సేపు ఓపికగా విన్న మోదీ సానుకూలంగా స్పందించారు. “మీ పదవీకాలంలో మేం చేయగలిగినంత మేర సహాయం చేస్తాం. ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంలో తోడ్పాటునందిస్తాం” అంటూ హామీ ఇచ్చారు.
ఆర్థిక వ్యవస్థను జగన్ పట్టించుకోవట్లేదు: యనమల