భారతీయ జనతా పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ఆపార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తాజాగా జాతీయ వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడిన ఆయన బీజేపీలో చేరేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు క్యూ కడుతున్నారని అన్నారు.
ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న చరిష్మా, ఆయన పనితీరు కారణంగానే సైనా నెహ్వాల్ వంటి వారు పార్టీలో చేరుతున్నారని అన్నారు. , బ్యాడ్మింటన్ లో అసమాన ప్రతిభను చూపిన సైనా నెహ్వాల్ చేరిక, బీజేపీకి బలాన్ని చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఆమె వంటి క్రీడాకారులకు బీజేపీ వంటి జాతీయ పార్టీయే సరైన వేదికని పేర్కొన్నారు.