పుల్వామా ఉగ్రదాడిలో పాక్ ప్రమేయంపై ఆధారాలుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14న జరిగిన ఆత్మహుతి దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనానంతరం ఇరు దేశాల మధ్య ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాద దాడుల బాధను భరిస్తూ కూర్చునే ప్రభుత్వం తమది కాదనీ, తప్పక ప్రతీకారం ఉంటుందని మోదీ హెచ్చరించగా.. దాడులను తిప్పికొడతామని పాక్ బదులిచ్చింది.
ప్రధాని మోదీ స్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్ పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైనప్పుడు మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పా. ఇన్నాళ్లూ పోట్లాడుకున్నామనీ, ఇకపై చేతులు కలిపి పేదరికం, నిరక్షరాస్యతలను రూపుమాపేందుకు కృషి చేద్దామని కోరా. అందుకు ఆయన ఒప్పుకుంటూ తాను పఠాన్ల కుమారుడిననీ, అబద్ధాలు చెప్పనని అన్నారు. మరి ఆ మాటను ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటారో లేదో చూడాలి’ అని సవాల్ విసిరారు.
ఇమ్రాన్ స్పందిస్తూ తాను పఠాన్ల కుమారుడినని, అబద్ధాలు చెప్పనని ఆ సందర్భంలో అన్నారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటారో? లేదో చూడాలి’ అని గుర్తు చేశారు. ఈ విషయం పై పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికీ అదేమాటకు కట్టుబడి ఉన్నానని, ఆధారాలు చూపాలని కోరింది. ఇరు దేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వాల కోసం భారత ప్రధాని ఓ అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్ విజ్ఞప్తి చేశారు.