మోదీ ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేసిందని కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘భారత్ బచావో’ ర్యాలీలో పాల్గొని చిదంబరం మాట్లాడారు.
దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతోంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఆర్థిక స్థితి బాగుందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమస్యపై కేంద్ర మంత్రుల వద్ద ఎటువంటి పరిష్కార మార్గాలు లేవని చిదంబరం వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతున్నప్పటికీ బీజేపీ నేతలు అంతా బాగానే ఉందని చెబుతున్నారని విమర్శించారు.
కుట్రలు చేయొద్దని కేసీఆర్కు నటుడు శివాజీ విజ్ఞప్తి