తెలంగాణాలో నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా పాత మిత్రులను ఈ వేదిక మీద ఉండటం సంతోషంగా ఉంది. పాలమూరు ప్రజలకు నమస్సుమాంజలి. మీ ఆశీర్వచనం కోసం మళ్ళీ ఇక్కడకు వచ్చాను. మీరు గతంలో ఇచ్చిన సహకారంతోనే ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపాను. ప్రత్యర్థుల విమర్శలు ఎన్ని ఉన్నాకూడా మీ సహకారమే కొండంత బలం. మీరే గత కాంగ్రెస్ పాలన కూడా చూశారు. 60 నెలల నా పాలన కూడా చూశారు. లోక్ సభ ఎన్నికలతోపాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఉంటె, (ప్రజా ధనం దుర్వినియోగం అయ్యేది కాదు) మోడీ తారా బలం ముందు కేసీఆర్ నిలవలేరని జ్యోతిష్కులు ఆయనకు సలహా ఇచ్చారు. తెలంగాణ భవిష్యత్తును రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలా లేక ఒక జ్యోతిష్కుడు నిర్ణయించాలో మీరే తేల్చుకోండి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీకి అస్తిత్వం ఉండదని భయం. కాంగ్రెస్-తెరాస లు ఒకే నాణానికి రెండు పార్శ్వాలు. ఎన్నో కుంభకోణాలలో కూరుకుపోయిన కాంగ్రెస్ .. దాదాపు అన్ని రాష్ట్రాలలో ఆదరణ కోల్పోయింది. చివరికి సైనికుల త్యాగాన్ని కూడా ప్రశ్నించే స్థాయికి దిగజారింది. ఈ ఐదేళ్ళలో కేసీఆర్ కుటుంబం బాగా బాగుపడింది. పాలమూరు ప్రజలు మాత్రం అలాగే ఉండిపోయారు అంటూ మోడీ తీవ్ర విమర్శలు చేశారు.