మోడీ సోదరుడు ప్రహ్లాద్ మళ్ళీ ప్రధాని గా మోడీ నే ఉండబోతున్నారని తెలిపారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన బీజేపీ శ్రేణులను ఉద్దేశించా మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకమైనా మోదీకి వచ్చిన ఇబ్బందేమీ ఉండదని, ఎన్డీయే సర్కారు మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని అన్నారు. విపక్షాలకు ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.
బీజేపీ నేత కొరటాల నరేష్, కూకట్ పల్లి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత వింగ్ కమాండర్ అభినందన్ ను పాకిస్థాన్ చెర నుంచి విడుదల కాపడటం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. పాకిస్థాన్ పై జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ కు దేశ ప్రజలందరి మద్దతూ లభిస్తోందని ఆయన చెప్పారు.