తెలంగాణను సెక్యులర్గా ఉంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నిజామాబాద్లో నిన్న ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలోఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు.
భారతదేశం అన్ని మతాల సంగమమని, ఈ దేశాన్ని మోదీ మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తన పౌరసత్వాన్ని అడిగే హక్కు మోదీకి లేదని అసద్ పేర్కొన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లకు మాత్రమే తాము వ్యతిరేకమని చెప్పారు. తాము హిందువులకు ఏ మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.