హైదరాబాద్ నగరంలో ఆదివారం ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. జంట నగరాల నుంచి వివిధ రూట్లలో నిత్యం నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో లింగంపల్లి-ఫలక్నుమా, ఫలక్నుమా-నాంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు బంద్ కానున్నాయి. యాకత్పురా-ఫలక్నుమా మధ్య కేబుల్ పనుల కారణంగా రైళ్ల రద్దైనట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమణించాలని రైల్వే అధికారులు పేర్కొన్నారు.