సీఎం కేసీఆర్ పాలనలో అవినీతి ద్వారాలు తెరవడం మినహా సాధించింది ఏంటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అవినీతిని తగ్గించేందుకు కొత్త రెవెన్యూ పాలసీ అంటున్నారంటే.. ఇప్పటివరకూ అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్టేగా అని అన్నారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పందని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఒప్పుకున్నారని అన్నారు. వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నందుకు కృతఙ్ఞతలు చెప్పారు. రెవెన్యూ అధికారులను కట్టడి చేయాల్సింది కలెక్టర్లు కాదా? కలెక్టర్లను అదుపు చేయాల్సింది సీఎం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ ఇప్పటికైనా టీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడటం సంతోషకరమని అన్నారు. టీఆర్ఎస్ ను జేపీ నడ్డా విమర్శించడాన్ని తాను సమర్థిస్తున్నానని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.