telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పూటకోమాట చెప్పడమే కాంగ్రెస్ నాయకుల నైజం: ఎమ్మెల్సీ గుత్తా

TRS Leader Gutha Critics Uttam

పూటకోమాట చెబుతూ కాలం వెల్లబుచ్చడమే కాంగ్రెస్ నాయకుల నైజమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చావు, బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రజలు గుర్తుకొస్తున్నాయని గుత్తా మండిపడ్డారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల్లో మోబిలైజేషన్ అడ్వాన్సుల్లో కమీషన్‌లు పొందిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదని దుయ్యబట్టారు.

ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్‌ఎల్‌బీసీకి నిధులు విడుదల చేసి పనులు వేగవంతం చేశామన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఆయన అహర్నిషలు కష్టపడుతున్నారన్నారు. సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న అన్ని చెరువులన్నీ నింపుతున్నామని చెప్పారు. నిజాయితీ లేని నాయకులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తూ శ్రీరంగనీతులు చెబుతున్నారని విమర్శించారు.

Related posts