telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీలో శాసనమండలి ఎన్నిక.. పోలింగ్ నేడే..

mlc elections in ap today

ఒకపక్క అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగానే, మరోపక్క ఏపీలో శాసనమండలి(ఎమ్మెల్సీ) ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మూడు శాసనమండలి నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా-గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు ఇవాళ నిర్వహించనున్నారు.

ఈ పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 5,62,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడు ఎన్నికల్లో మొత్తం 94 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. ఈ పోలింగ్ కోసం 123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 26న ఉంటుంది.

Related posts