ఒకపక్క అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగానే, మరోపక్క ఏపీలో శాసనమండలి(ఎమ్మెల్సీ) ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మూడు శాసనమండలి నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా-గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు ఇవాళ నిర్వహించనున్నారు.
ఈ పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 5,62,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడు ఎన్నికల్లో మొత్తం 94 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. ఈ పోలింగ్ కోసం 123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 26న ఉంటుంది.