ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారైంది. ఏపీలో మూడు…తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 16న నామినేషన్ల పరిశీలన, 19వతేదీ వరకు ఉపసంహరణ గడువుగా ఈసీ పేర్కొంది. ఈ నెల 26న ఎన్నికలు నిర్వహిస్తామని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ ప్రకటించింది. ఏపీలో కరణం బలరామకృష్ణమూర్తి, కృష్ణ శ్రీనివాస్, వీరభద్రస్వామి రాజీనామా చేశారు. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటుతో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
next post
పవన్ అలా మాట్లాడడం సరికాదు: కేటీఆర్