నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 45 రోజుల పాటు ఈ ఉప ఎన్నికను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇదివరకు ఒకసారి నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరో సారి వాయిదా పడింది.
ఏప్రిల్ మొదటి వారంలో జరగాల్సిన ఈ ఉప ఎన్నిక మరో 45 రోజులు వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. దీనితో ఆగస్ట్ మొదటి వారంలో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికలో గెలుపు లాంఛనమే అనుకున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే మిగిలింది.