ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ పదవికి నోటిఫికేషన్ జారీ అయ్యింది. బుధవారం ఉదయం శాసనమండలిలో ఇన్చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఈ నోటిఫికేషన్ను జారీ చేశారు. ఈరోజు సాయంత్రంలోగా నామినేషన్లను దాఖలు చేయాల్సిందిగా ప్రకటన చేశారు. రేపు ఉదయం శాసనమండలి చైర్మన్ ఎన్నిక జరుగనుంది. కాగా అధికార పార్టీ టీడీపీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా షరీఫ్ పేరు ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే.
previous post
బీజేపీ నేతలకు పబ్లిసిటీపిచ్చి పట్టుకుంది: తలసాని