telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీటీడీని కూడా తెలంగాణకు అప్పగించేస్తారా?: ఎమ్మెల్సీ అశోక్‌బాబు

ashok babu mlc

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో జగన్‌ కీలుబొమ్మలా మారిపోయారని అన్నారు. ఏపీ ప్రజల హక్కులను ఆయనకు దఖలు పరుస్తున్నారని ఆరోపించారు. ఇద్దరి మధ్యా ఎంత మిత్రత్వం ఉన్నాటీటీడీని కూడా తెలంగాణకు అప్పగించేస్తారా? అని ఎద్దేవా చేశారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కేసీఆర్‌తో కలిసి జగన్‌ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఏమిటని ప్రశ్నించారు. గోదావరి జలాల తరలింపు కూడా ఏపీ భూభాగం నుంచే జరగాలని అన్నారు. వైకుంఠ బ్యారేజీ నిర్మాణం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు. అలాకాకుండా దుమ్ముగూడెం నుంచి వయా నల్గొండ మీదుగా నాగార్జుసాగర్‌కు తరలిస్తే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. గోదావరి నీటి విషయంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Related posts