ఆర్టికల్ 370కు సంబంధించిన బిల్లు పై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పటి పరిస్థితుల రీత్యా జమ్ముకశ్మీర్ అంశంపై నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పుకొచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ణయం సమర్థనీయమేనని జగారెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా నెహ్రూపై మోదీ, అమిత్ షాలు చేసిన ఆరోపణలు కరెక్టు కాదని అన్నారు. నాడు కశ్మీర్ ను నెహ్రూ కాపాడారు కనుకనే, నేడు మోదీ, అమిత్ షాలు ఈ నిర్ణయం తీసుకోగలిగారని ఆయన అన్నారు. దేశానికి కాంగ్రెస్, బీజేపీలు రెండూ అవసరమేనని జగ్గారెడ్డి చెప్పడం గమనార్హం.