telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దీక్షిత్ రెడ్డి కేసు : కిడ్నాపర్ ను ఉరి తియ్యాలి

seethakka mla

పెట్రోల్ పోసి చంపిన కిడ్నాపర్ ను ఉరి తియ్యాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. డబ్బుల కోసం చిన్న పిల్లల్ని చంపడం బాధాకరమన్నారు. నిన్న రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ కు గురై హత్య కబడ్డ బాలుడు దీక్షిత్ రెడ్డి కుటుంబాన్నీ సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పెట్రోల్ పోసి దారుణoగా చంపిన కిడ్నాపర్ సాగర్ తో పాటు సహకరించిన నిధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ లు అప్రమత్తంగా ఉండాలని అని అన్నారు. కాగా..నాలుగు రోజుల కిందట మహబూబాబాద్‌ కిడ్నాపైన 9 ఏళ్ల దీక్షిత్‌ రెడ్డిని.. కిడ్నాపర్లు అత్యంత కిరాతకంగా చంపేశారని పోలీసులు వెల్లడించడంతో.. బాలుడి కుటుంబం శోకసంద్రమైంది. బిడ్డ క్షేమంగా తిరిగొస్తాడని ఆశగా ఎదురుచూశానని… కనీసం చివరిసారి ఒడిలోకి తీసుకుని గుండెలకు హత్తుకునే వీలు కూడా లేకుండా చేశారని… దీక్షిత్‌ తల్లి వసంత కన్నీరుమున్నీరైంది. తన కొడుకును ఎలా చంపారో.. కిడ్నాపర్లను కూడా అలాగే చంపాలని ఆమె కోరుతోంది.

Related posts