telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ

ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి

over speed costs 4 students

ములుగు కాంగ్రెసు ఎమ్మెల్యే  సీతక్క కారు  ఢీకొని ఓ చిన్నారి మృతి చెందింది. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది.  జిల్లాలోని మంగపేట జీడివాగు వద్ద వేగంగా వెళుతున్న ఎమ్మెల్యే సీతక్క కారు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న దంపతులతో పాటు వారి చిన్నారి(2)కి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వీరిని ఎమ్మెల్యే కారులో ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో బైక్ దాదాపుగా నుజ్జు నుజ్జు అయింది. సీతక్క కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts