లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్యే రోజాపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజా ఘాటుగా స్పందించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని చెప్పారు. సోషల్ మీడియా లోఅని పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. తన నియోజకవర్గంలోని సుందరయ్య నగర్ లో త్రాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం వీరి కోసం ఎలాంటి సౌకర్యం కల్పించలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఆ సంతోషంతోనే ప్రజలు తనను ఆహ్వానించారన్నారు. అయితే వారు పూలు చల్లుతారని తాను ఊహించలేదని అన్నారు. వారు ప్రేమతో చేస్తున్న పనికి ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నానని చెప్పారు. విపక్ష నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.