telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై రోజా కౌంటర్‌

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించారు . ఆయన వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. అయ్యన్న ఎమ్మేల్యే పదవి పీకేసారు. మంత్రి పదవి పీకేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పీకేసారు. లోకేష్ జెండా పదివి పీకేసారు. ఇంకా ఎమి పీకాలి అంటూ కౌంటర్‌ ఇచ్చారు రోజా.

మరోవైపు.. కోడెల శివప్రసాద్‌కు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్నపాత్రుడు ఏమయ్యాడని రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో వైఎస్‌ జగన్‌ని చూసి నేర్చుకోవాని సూచించారు రోజా. సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మాలన్న ప్రతిపాదనలపై స్పందిస్తూ.. సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సీఎం జగన్‌ అమలుకు పూనుకుంటున్నారని తెలిపారు. కాగా, అయ్యన్నపాత్రుడు కామెంట్లపై వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఒంటికాలితో లేస్తున్నారు.

Related posts