తాను వైసీపీ నుంచి గెలిచాక టీడీపీ నుంచి ఆఫర్లు వచ్చాయని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాచెప్పారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా పలు అంశాలపై ముచ్చటించారు. టీడీపీ నేతల తీరు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. మీరు అనవసరంగా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
టీడీపీలోనే ఉండి ఉంటే మీకు మంత్రిపదవులు వచ్చేవని తనతో చెప్పారని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల గురించి తెలిసినవాళ్లు వాళ్ల మాటలను నమ్మరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై గళం వినిపించేందుకే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. చదువుకున్న యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు.